సినిమారాజమౌళి-మహేశ్ చిత్రం పుకార్లపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ

రాజమౌళి-మహేశ్ చిత్రం పుకార్లపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ

-

RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తదుపరి చిత్రంపై అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)తో తన తదుపరి చిత్రం అని జక్కన్న ప్రకటించండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ పాత్ర హనుమంతుని స్ఫూర్తితో తెరకెక్కనుందనే వార్త కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గాసిప్స్ పై రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) క్లారిటీ ఇచ్చారు.

తన కుమారుడు రాజమౌళికి పౌరాణిక కథలు అంటే చాలా ఇష్టమని.. అందుకే తన చిత్రాలు భారతీయ సంస్కృతికి అనుగుణంగా ఉంటాయన్నారు. మహేశ్(Mahesh Babu) తో చిత్రంలో కూడా ఆ మూలాలు ఉంటాయి.. కానీ హనుమంతుని స్ఫూర్తితో మాత్రం ఉండదని స్పష్టంచేశారు. అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. కాగా ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అయిపోగానే రాజమౌళి చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో భారీ బడ్జెట్ తో జక్కన్న తెరకెక్కించనున్నాడు.

- Advertisement -spot_imgspot_img

Read more RELATED
Recommended to you

- Advertisement -spot_img

Latest news

Must read